15న మళ్లీ కలవండి: తెదేపాకు సీఈసీ లేఖ - central election commission
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలో తలెత్తిన సమస్యలపై.. తెదేపా వెలిబుచ్చిన అభ్యంతరాల మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. తమను 15న మరోసారి కలవొచ్చని చెబుతూ తెదేపాకు లేఖ పంపింది.
![15న మళ్లీ కలవండి: తెదేపాకు సీఈసీ లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2992860-thumbnail-3x2-babu.jpg)
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పిన అభ్యంతరాలపై.. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ల మొరాయింపు విషయమై.. తెదేపాకు లేఖ రాసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు మరోసారి తమను కలవొచ్చని చెప్పింది. అయితే.. తెదేపా తరఫున సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ను పంపడంపై అభ్యంతరం వెలిబుచ్చింది. ఇతర సాంకేతిక నిపుణులతో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ లేఖను తెదేపా న్యాయ విభాగం అధ్యక్షుడు రవీంద్రకుమార్కు పంపించింది.