ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపట్నుంచి సభాపర్వం...ఇవాళ బీఏసీ సమావేశం - BAC meeting today under assembly speaker

ఇవాళ ఉదయం 10.30 గంటలకు సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12వ తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్​ను సభ ముందుంచనున్నారు.

రేపట్నుంచి సభాపర్వం...ఇవాళ బీఏసీ సమావేశం

By

Published : Jul 10, 2019, 6:01 AM IST

గత అసెంబ్లీ సమావేశాల కంటే భిన్నమైన మార్పులు ఉంటాయన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గటే నిర్ణయాలు తీసుకుంటుంది. అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో బిజినెస్​ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సారీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించనున్నారు.
15 వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సెషన్ ప్రారంభానికి ఒకరోజు ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఏసీ సమావేశానికి ప్రభుత్వం తరపున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అధికార పార్టీ తరపున ప్రభుత్వ విప్​లు, విపక్షం తరపున తెదేపా ప్రతినిధులు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.
శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12 తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details