ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా పోరాటం.. హక్కుల సాధనకే: చంద్రబాబు

న్యాయమైన కోరికల సాధన, విభజన హామీల అమలుకోసమే దిల్లీలో ధర్నా చేపట్టామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

By

Published : Feb 11, 2019, 8:59 PM IST

దేశమంతా అండగా నిలబడ్డారు

దేశమంతా అండగా నిలబడ్డారు
దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగింపు ప్రసంగంలో చంద్రబాబు మాట్లాడారు. న్యాయమైన కోరికల సాధనకోసమే ఇక్కడకు వచ్చామని, విభజన హామీల అమలు కోసమే ధర్నా చేశామని చెప్పారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు హోదా కోసం పోరాడాయని తెలిపారు. ధర్మపోరాట దీక్షకు మద్దతు పలికిన అందరికీ 5 కోట్ల తెలుగువారి తరఫున ధన్యవాదాలు తెలిపారు. మోదీ, ఆయన అనుచరులు తప్ప దేశం మొత్తం ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిందని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 3 అఖిల పక్ష భేటీలకు భాజపా, వైకాపా తప్ప మిగిలిన అన్నీ పార్టీలు హాజరయ్యారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details