ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌలు రైతులకూ సాయం: సోమిరెడ్డి - chandrababu

కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించామనీ... కేంద్ర సాయం వర్తించని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి

By

Published : Feb 16, 2019, 8:30 PM IST

Updated : Feb 16, 2019, 9:03 PM IST

కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి కోసం రూ.9 వేలు ఇస్తామని...సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి తెలిపారు. తొలి విడతలో రూ.4 వేలు... రెండో విడతలో రూ.5 వేలు ఇస్తామని వివరించారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అన్నదాతా సుఖీభవ పథకంపై సమీక్ష అనంతరం... మంత్రి సోమిరెడ్డి మాట్లాడారు. కేంద్ర సాయం వర్తించని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి
అన్నదాత సుఖీభవ పథకం కింద.. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. రూ.4 వేల కోట్లతో పంటలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మైనర్ పిల్లలుంటే ఒకే కుటుంబంగా... మేజర్లు అయితే వేరే కుటుంబం కింద పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. రైతు రుణ మాఫీ కింద ఇవ్వాల్సిన రెండు విడతల నగదును మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లిస్తామని చెప్పారు.
Last Updated : Feb 16, 2019, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details