'ఫారం-7 దుర్వినియోగం తొలిసారే' - ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
ఫారం-7 ద్వారా ప్రత్యర్థుల ఓట్లు తొలగించాలని చూడటం ఇదే తొలిసారి. గతంలో ఈ పరిస్థితి లేదు. - ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
ఫారం-7 దరఖాస్తులపై వేసినసిట్కు ఈసీకి సంబంధం లేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.కేసుల దర్యాప్తు వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని తెలిపారు.ప్రత్యర్థుల ఓట్లు తొలగించాలనేఫారం-7 ప్రయోగిస్తున్నారనితొలిసారి గుర్తించామని...గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సిబ్బంది ఎక్కువ సమయం ఫారం-7 పరిశీలనకు కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు.ఎన్నికల ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.