విశాఖ మెట్రోకు కొరియా రుణం - amaravathi metro
విశాఖ మెట్రో నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు కొరియా ఎగ్జిం బ్యాంకు ప్రతినిధులు అంగీకరించారు. సీఎస్ పునేఠను కలిసి చర్చించారు. ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
![విశాఖ మెట్రోకు కొరియా రుణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2625011-983-407dd9ca-95c6-47a7-8489-30206931cd22.jpg)
విశాఖ మెట్రోకు రూ.4,100 కోట్ల రుణం
విశాఖ మెట్రోకు రూ.4,100 కోట్ల రుణం
ఈ ప్రతిపాదనల్ని పరిశీలించిన కొరియా ఎగ్జిం బ్యాంకు రూ.4 వేల 100 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించింది. రుణం మంజూరుకు అవసరమైన విధివిధానాలపై ప్రతినిధుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించింది. ప్రాజెక్టు వివరాలు... ఇతర డాక్యుమెంటేషన్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని... సకాలంలో రుణం మంజూరు చేయాలని సీఎస్ పునేఠ ఆ బృందాన్ని కోరారు. విశాఖ మెట్రోరైలు నిర్మాణంపై ప్రభుత్వం ఆసక్తిగా ఉందని... త్వరగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఉన్నామని వివరించారు.
Last Updated : Mar 7, 2019, 9:54 AM IST