ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2023, 9:10 PM IST

ETV Bharat / state

Public fire on YSRCP leaders: అధికార పార్టీ నేతల అడ్డదారులు.. అవస్థల్లో అమాయక ప్రజలు

Yanadi community women fire on YSRCP leaders: గ్రానైట్ నిక్షేపాల పేరుతో తమ కాలనీలను ఖాళీ చేయించి, అధికార పార్టీ నేతలు దారుణంగా మోసం చేశారంటూ.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం మల్లాయపాలెం పరిధిలో నివాసముంటున్న యానాది సంఘం(ఎస్టీ కాలనీ) మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వత ఇల్లు కట్టిస్తామని హామీలిచ్చి.. నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Colonists
Colonists

అక్రమ సంపాదన కోసం అధికార పార్టీ నేతలు అడ్డదారులు..అవస్థల్లో అమాయక ప్రజలు

Yanadi community women fire on YSRCP leaders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతలు.. పార్టీ అండదండలు చూసుకుని అక్రమ సంపాదన కోసం అమాయక ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. గ్రానైట్ నిక్షేపాల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేస్తే.. శాశ్వత ఇళ్లు కట్టిస్తామని, నష్ట పరిహారం చెల్లిచెస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీలిచ్చి.. కాలనీవాసులను ఖాళీ చేయించారు. చివరికు వారికి కావాల్సిన సంపాదను దోచుకుని, మాట మార్చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలం మల్లాయపాలెంలోని ఎస్టీ కాలనీలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయంటూ.. అధికార పార్టీకి చెందిన నాయకులు తమను దారుణంగా మోసం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాసాల్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

గ్రానైట్ నిక్షేపాల పేరుతో మోసాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం మల్లాయపాలెం గ్రామ పంచాయితీ పరిధిలో సుమారు 30 నుండి 40 యానాది సంఘం(ఎస్టీ కాలనీ) కుటుంబాలు ఊరికి దూరంగా నివాసముంటున్నారు. ఈ క్రమంలో గ్రామ పొలాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయంటూ.. కొంతమందివైఎస్సార్సీపీ నేతలు గ్రామ రైతుల వద్ద పొలాలను కొనుగోలు చేసి, గ్రానైట్ క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ నిక్షేపాల కోసం క్వారీలలో బ్లాస్టింగ్ జరిపితే, ప్రాణనష్టం జరుగుతుందని గ్రహించిన అద్దంకి వైసీపీ బాద్యుడు.. యానాది కాలనీ వాసుల వారితో మాట్లాడారు. అనంతరం కాలనీ ఖాళీ చేస్తే.. 'మీకు మంచి ఇళ్లు కట్టిస్తానని, దాంతోపాటు కొంత ధనం ముట్టజేస్తానని' హామీ ఇచ్చి వారిని అక్కడ నుండి ఖాళీ చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసి తెచ్చుకొని.. గ్రానైట్ నిక్షేపాలను వెలికి తీయటం మొదలుపెట్టారు.

కొత్త ఇళ్ల కోసం బాధితుల ఎదురుచూపులు.. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకుడి మాటలు నమ్మి, కాలనీ ఖాళీ చేసిన నివాసులకు ఊరికి కొంచెం దూరంలో తాత్కాలిక గృహ సముదాయాలను ఏర్పాటు చేశారు. ఇక అంతే, ఏళ్లు గడుస్తున్నా వారిని పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇల్లు కట్టించి సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన నాయకులు మాటలు మార్చారు. దీంతో చేసేదేమీలేక నాలుగేళ్లుగా తాత్కాలిక రేకుల షెడ్లలోనే నరకం చూస్తున్నామని.. యానాది సంఘం (ఎస్టీ కాలనీ) మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

రేకుల షెడ్లలో ఉండలేకపోతున్నాం..ఆదుకోండి..పలువురు బాధిత మహిళలు మాట్లాడుతూ..''గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయంటూ మా ఇళ్లను ఖాళీ చేయించారు. శాశ్వత ఇల్లు కట్టిస్తామని హామీలు ఇచ్చి.. ఊరికి దూరంలో రేకుల షెడ్లు కట్టించారు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు రేకుల షెడ్లలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. శాశ్వత ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రూ. 1.80 వేలు ఇప్పిస్తామంటున్నారు. మిగిలినవి మీరే బరాయించాలని చెప్తున్నారు. కాలనీలో ఇళ్లు నిర్మించుకుందామంటే కరెంటు లేదు. స్తంభాలకు కర్రలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. కాలనీ మొత్తానికి ఒక్క బోరే ఉంది. అది చెడిపోతే పట్టించుకునే దిక్కు కూడా లేదు. దారుల వసతి కూడా లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి'' అని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details