ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయదుర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపన - rayadurgam lo abhivruddi panulaku sankustapana chesina prabutwa chif wip kapu ramachandra reddy

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.

ground breaking cermony for development works in anantapur district
రాయదుర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపన

By

Published : Jan 17, 2021, 5:36 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ మున్సిపాలిటీ పరిధిలో రూ. 84 లక్షలతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్​లో రూ.74 లక్షలతో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్​కు, డ్రైవర్స్ కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న తాగునీటి పథకం పైప్​లైన్ నిర్మాణానికి కాపు రామచంద్రారెడ్డి భూమిపూజ చేశారు. పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details