ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరు వానలోనూ వైకాపా ప్రచారం.. కుర్చీలే గొడుగులుగా - ycp election campaign

అనంతపురం జిల్లా పెనుకొండ పరిధి ఇస్లాపురంలో జోరు వానలోనూ వైకాపా ఎన్నికల ప్రచారం(ycp election campaign) నిర్వహించింది. వర్షం పడుకున్నా లెక్క చేయడకుండా సమావేశంలో నాయకులు ప్రసంగించారు. స్థానికులు కూడా తగ్గేదేలే అన్నట్లు సమావేశంలో పాల్గొన్నారు.

ycp election campaign in heavy rain at anantapur district
జోరు వానలో వైకాపా ఎన్నికల ప్రచారం

By

Published : Nov 12, 2021, 10:11 PM IST

జోరు వానలో వైకాపా ఎన్నికల ప్రచారం

జోరు వానలోనూ అధికార పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల ప్రచారం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వర్షంలోనే ప్రచారం(ycp election campaign in heavy rain at penukonda ) కొనసాగించారు. స్థానిక ప్రజలు సైతం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు. ఖాళీ కుర్చీలను తలపై అడ్డుపెట్టుకొని మరీ సమావేశంలో పాల్గొనడం ఒకింత అశ్చర్యానికి గురి చేసింది.

స్థానిక 1వ వార్డు ఇస్లాపురంలో వైకాపా అభ్యర్థి జయమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సమావేశం(ycp election campaign in heavy rain ) నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షం కురుస్తున్నా.. నాయకులు లెక్కచేయకుండా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details