ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 6, 2021, 12:51 PM IST

ETV Bharat / state

తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ... ముగ్గురికి గాయాలు

అనంతపురంలో వైకాపా, తెదేపా శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ycp tdp fight
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ... ముగ్గురికి గాయాలు

అనంతపురం నగరంలోని రెండో డివిజన్​లో తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రెండో డివిజన్​లో వైకాపా, సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్నాయి. తెదేపా.. సీపీఐకు మద్దుతునిస్తోంది.

సుదర్శన్, సూరి అనే వ్యక్తులు వైకాపాకు మద్దతిస్తున్నారనే కారణంతో శ్రీనాథ్ వారితో గొడవపడ్డాడు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయలవగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details