ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 14, 2020, 7:14 AM IST

ETV Bharat / state

కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ముతుకురు గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

అనంతపురం జిల్లా గుడిబండ మండలం ముతుకూరు గ్రామంలో ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శంకరగల్లు గ్రామానికి చెందిన అంకితకు, ముతుకూరు గ్రామానికి చెందిన నరసింహమూర్తితో రెండు నెలల క్రితం వివాహమైంది. అంకిత తరుచూ కడుపునొప్పితో బాధపడుతుండేది.

ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ క్రమంలో కడుపునొప్పి తాళలేకే ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details