ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుక్కెడు నీళ్లైనా లేవే...అధికారుల నిర్లక్ష్యమే కారణం - water problem at ananthapur

అనంతపురం జిల్లాలో నీళ్లు రావటం లేదని ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేశారు.

నీళ్లు రావటం లేదని రోడ్డుపై బైఠాయించిన ప్రజలు

By

Published : Jul 26, 2019, 2:55 PM IST

నీళ్లు రావటం లేదని రోడ్డుపై బైఠాయించిన ప్రజలు

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజుల అయినా కుళాయి నుంచి చుక్క నీరైనా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించటంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు.

ABOUT THE AUTHOR

...view details