ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శరీరమంతా బొబ్బలు... వింత వ్యాధితో అవస్థలు

By

Published : May 2, 2020, 8:56 PM IST

ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతులపై విధి కన్నెర్ర చేసింది. కరోనా లాక్​డౌన్​తో భర్తను ఉపాధికి దూరం చేసింది. అంతుచిక్కని వ్యాధి రూపంలో భార్యను మంచానికి పరిమితం చేసింది. ఇల్లాలికి వచ్చిన జబ్బు ఏమిటో తెలీక, చికిత్స అందించేందుకు డబ్బులు లేక దాతల సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తోంది ఆ జంట.

woman dufferes with unknown dieses in thadimarri ananthapuram district
శరీరమంతా బొబ్బలు... వింత వ్యాధితో అవస్థలు

శరీరమంతా బొబ్బలు... వింత వ్యాధితో అవస్థలు

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నర్సింపల్లికి చెందిన కృష్ణవేణి అనే మహిళ వింత వ్యాధితో బాధపడుతున్నారు. శరీరమంతా బొబ్బలు లేచి తీవ్ర అనారోగ్యంతో అవస్థ పడుతున్నారు. కృష్ణవేణి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. బాధితురాలి భర్త శ్రీనివాసులు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. లాక్​డౌన్​తో ఆటోలు నడవకపోవడంతో కృష్ణవేణికి వైద్యం చేయించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని శ్రీనివాసులు వాపోయాడు. బాధితురాలి పరిస్థితి తెలుసుకొని పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. కృష్ణవేణికి వచ్చిన జబ్బు ఏమిటో నిర్ధారణ కాకపోవడంతో ఆమెను బెంగళూరు సెయింట్ జోన్ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details