ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం.. ఉరి వేసుకుని దంపతుల బలవన్మరణం - అనంతపురంలో దంపతుల ఆత్మహత్య

అనంతపురం జిల్లా కొర్రకోడుడ్యామ్​లో కుటుంబ కలహాలతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసి వెళ్లిపోయారు.

wife and husband suicide in korrakodu dyam in ananthapuram district
ఉరివేసుకుని దంపతుల బలవన్మరణం

By

Published : Dec 2, 2019, 12:58 PM IST

అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు డ్యామ్ గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వాసు, నాగతేజస్విని కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాసు అదే గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ తాగునీటి ప్రాజెక్టులో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు. మొదట్లో ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. అయితే కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శనివారం రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లలు పడుకున్నాక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఉరివేసుకుని దంపతుల బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details