ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDER: భార్య చూస్తుండగా.. వెేటకొడవలితో భర్త దారుణహత్య

By

Published : Sep 1, 2021, 9:06 PM IST

Updated : Sep 1, 2021, 10:16 PM IST

భార్య చూస్తుండగానే తన భర్తను ఓ వ్యక్తి వేడకొడవలితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గార్లదిన్నె మండలంలో జరిగింది.

Murder
హత్య

భార్య చూస్తుండగా.. వెేటకొడవలితో భర్తను కసితీరా నరికాడు

భార్య ముందే భర్తను వేట కొడవళ్లతో ఓ వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. తనను కూడా చంపుతాడనే భయంతో అక్కడినుంచి మృతుని భార్య పారిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో జరిగింది.

పెనకచెర్లకు చెందిన నాగరాజు అనే వ్యక్తి అతని భార్యతో కలిసి ఉదయం తోట పనికి వెళ్లాడు. భార్యభర్తలిద్దరూ తోట పని చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన కురువ ఎర్రిస్వామి అనే వ్యక్తి..వేట కొడవలితో తన భర్తను నరికి చంపాడని మృతుని భార్య తెలిపింది.

మృతుని భార్య చెప్పిన వివరాల ప్రకారం..

తన భార్యతో నాగరాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఎర్రిస్వామి గతకొన్ని రోజుల అనుమానం పెంచుకున్నాడు. దీనికి సంబంధించి 2017లో పోలీసు స్టేషన్​లో పంచాయతీ కూడా జరిగింది. అయితే అప్పటినుంచి కక్ష పెంచుకున్న ఎర్రిస్వామి..భర్తను చంపినట్లు తెలిపింది.


ఇదీ చదవండి: Bride Escape:కొద్ది గంటల్లో వివాహం...కానీ అంతలోనే..

Last Updated : Sep 1, 2021, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details