ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటపొలాలను నాశనం చేస్తున్న ఎలుగుబంటి - దేవేంద్రపురంలో ఎలుగుబంటి సంచారం

అనంతపురం జిల్లా దేవేంద్రపురం గ్రామ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తూ పంటపొలాలను నాశనం చేస్తోందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి తమ పంటలను రక్షించాలని రైతులు కోరారు.

wandering bear in dendrapuram ananthapuram district
పంటపొలాలను నాశనం చేస్తున్న ఎలుగుబంటి

By

Published : Aug 20, 2020, 10:57 AM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం దేవేంద్రపురం గ్రామ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పంట పొలాల మీద పడిన ఎలుగుబంటి టమాట, వేరుశనగతో పాటు ఇతర పంటలను నాశనం చేస్తోందని రైతులు వాపోతున్నారు. కొంతమంది యువకులు కలిసి ఆ ఎలుగును తరిమికొట్టారు. అయినప్పటికీ అది మళ్లీ వచ్చే అవకాశం ఉందని.. అటవీశాఖ అధికారులు స్పందించి తమ పంటలను రక్షించాలని రైతులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details