అనంతపురం జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామంలో ఇద్దరు వాలంటీర్లు ఘర్షణ పడ్డారు. మాస్క్ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణ వల్ల మూడు గంటల సేపు సరుకుల పంపిణీ ఆలస్యమైందని.. ఎండలో ఇబ్బంది పడ్డామని ఆవేదన చెందారు.
వాలంటీర్ల మధ్య ఘర్షణ.. 3 గంటల పాటు సరుకుల పంపిణీ ఆలస్యం - volunters fight in putluru mandal
పుట్లూరు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు ఘర్షణ పడ్డారు. ఉదయం 6 నుంచి 1 గంట లోపు రేషన్ సరుకులు పంపిణీ చేయాల్సిన సమయంలో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా .. 3 గంటల ఆలస్యంగా సరుకులు పంచారు.
నాగిరెడ్డిపల్లిలో గ్రామ వాలంటీర్ల ఘర్షణ