సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉరవకొండలో ఆందోళన - urvakonda latest news
ఉరవకొండ పట్టణంలోని సాయిబాబానగర్ వద్ద సెల్ టవర్ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ఈ సెల్ టవర్లు ఏర్పాటు చేసి మా ఆరోగ్యాలతో చెలగాటం ఆడతారా? అంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
![సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉరవకొండలో ఆందోళన urvakonda people protest against cell tower formation at ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7708159-90-7708159-1592724282644.jpg)
సెల్ టవర్ ఏర్పాటు ను వ్యతిరేకిస్తూ ఉరవకొండలో ఆందోళన
అనంతపురం జిల్లా, ఉరవకొండ పట్టణంలోని స్థానిక షిర్డీ సాయిబాబా నగర్ వద్ద సెల్ టవర్ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. చిన్న పిల్లలు, గర్భవతులు ఉన్నారని, టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ వల్ల ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆరోపించారు. వెంటనే పనులు ఆపాలని. లేదంటే చుట్టుపక్కల వారికి ఇబ్బందులు వస్తాయన్నారు.