ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉరవకొండలో ఆందోళన

ఉరవకొండ పట్టణంలోని సాయిబాబానగర్ వద్ద సెల్ టవర్​ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ఈ సెల్ టవర్లు ఏర్పాటు చేసి మా ఆరోగ్యాలతో చెలగాటం ఆడతారా? అంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

By

Published : Jun 21, 2020, 2:13 PM IST

urvakonda people protest against cell tower formation at ananthapuram district
సెల్ టవర్ ఏర్పాటు ను వ్యతిరేకిస్తూ ఉరవకొండలో ఆందోళన

అనంతపురం జిల్లా, ఉరవకొండ పట్టణంలోని స్థానిక షిర్డీ సాయిబాబా నగర్ వద్ద సెల్ టవర్​ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. చిన్న పిల్లలు, గర్భవతులు ఉన్నారని, టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ వల్ల ప్రమాదం ఏర్పడుతుందని వారు ఆరోపించారు. వెంటనే పనులు ఆపాలని. లేదంటే చుట్టుపక్కల వారికి ఇబ్బందులు వస్తాయన్నారు.

ఇదీ చదవండి: పెన్సిల్ మొనపై అందమైన ఆకృతులు

ABOUT THE AUTHOR

...view details