ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో రాంనగర్ బ్రిడ్జి సమీపంలో వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా రాంనగర్​ బ్రిడ్జి సమీపంలో పండ్లు అమ్ముకునే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా హత్య చేశారా లేక మద్యం మత్తులో కిందపడి గాయపడి మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

By

Published : Dec 18, 2020, 8:42 PM IST

unknown person death near ramnagar bridge at ananthapur district
అనుమానస్పదంగా రాంనగర్ బ్రిడ్జి సమీపంలో వ్యక్తి మృతి

అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నగరంలోని రాంనగర్ బ్రిడ్జి వద్ద పండ్ల వ్యాపారం చేసే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైనా హత్య చేశారా లేక మద్యం మత్తులో కిందపడి తలకు గాయమై మరణించాడా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details