అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఈశ్వరయ్య, ఉపేంద్ర అనే యువకులు మద్యానికి బానిసలై చేనేత వృత్తిని వదిలేసి బైక్ దొంగతనాలు చేశారు. పలువురి ఫిర్యాదుతో విచారించిన పోలీసులు వీరిని అరెస్టు చేసి 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరు దొంగతనాలు అలవాటు చేసుకున్నట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.
చేనేతను వదిలేసి చేతికి పని చెప్పారు.. చివరికి జైలు పాలయ్యారు..! - bike thefis arrest in anantapu dst
సులభంగా డబ్బు సంపాదించాలని ఆ యువకుల్లో వచ్చిన ఆలోచన వారిని దొంగలుగా మార్చింది. చేనేత వృత్తిని వదిలి ద్విచక్రవాహనాలు దొంగతనం చేయటం మొదలుపెట్టారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఘటన వివరాలవి..!
![చేనేతను వదిలేసి చేతికి పని చెప్పారు.. చివరికి జైలు పాలయ్యారు..! two persons arrested in anatapur dst for bike chori](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6115498-23-6115498-1582029712233.jpg)
బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు