ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవ దహనం

అనంతపురం జిల్లా ఎంగిలిబండలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

By

Published : Dec 27, 2020, 5:10 PM IST

two man spotly dead in a road accident at engilibanda ananthapuram district
లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవదహనం

లారీ-ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు సజీవదహనం

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 67 వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో... లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డీజిల్​ ట్యాంక్ పేలి ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ దగ్ధం కాగా... ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతులు యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రోషి రెడ్డిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details