అనంతపురంలో రెండు లారీలు ఢీ
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీల ఆధారాల ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.