ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వేళ పేదలను ఆదుకుంటున్న ట్రస్టులు - విశాఖ జిల్లా తాజా వార్తలు

కొవిడ్ ఉద్ధృతి వేళ బాధితుల కోసం మెరుగైన చికిత్స అందిస్తున్న ఆర్డీటీ సేవలను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కొనియాడారు. ఈ మేరకు ఆర్డీటీ డైరక్టర్​ ఫెర్రర్​కు రూ. 10లక్షల చెక్కును అందించారు.

చెక్కును అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే
చెక్కును అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే

By

Published : May 24, 2021, 7:42 PM IST

కొవిడ్ ఉధృతి వేళ బాధితుల కోసం మెరుగైన చికిత్స అందిస్తున్న ఆర్డీటీ సేవలను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కొనియాడారు. ఈ మేరకు ఆయన ఆర్డీటీ డైరక్టర్ మాంచో ఫెర్రక్​కు రూ.10 లక్షల చెక్కును అందించారు. కరవు ప్రాంతంలో పేదలకు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. తమ వంతు బాధ్యతగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం సీతంపేటలో సాహు మహారాజ్ దళిత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, ఫేస్​షీల్డ్స్, మాస్కులను అందించారు. వీటితో పాటు 40 కుటుంబాలకు కూరగాయలను అందించారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కాటంవారిపల్లెలో పేదవారికి దానధర్మ ట్రస్టు ఆధ్వర్యంలో 300 రూపాయల నిత్యావసర సరుకులు, కొంత నగదును అందించారు. ట్రస్టు అధ్యక్షుడు కురంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ... పేదలు కరోనా కాలంలో ఉపాధి కోల్పోయారని తెలిపారు. తమవంతు సాయంగా పేద కుటుంబాలకు అండగా ఉండాలనే సంకల్పంతో ఈ ట్రస్టు ద్వారా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

ఇదీ చదవండి:

'కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​ఓ అనుమతులు!'

ABOUT THE AUTHOR

...view details