ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2020, 8:56 PM IST

ETV Bharat / state

ప్రజాస్వామ్యానికి ఇవాళ బ్లాక్ డే: తెదేపా ఎమ్మెల్సీలు

మండలి రద్దుపై వైకాపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చీకటి రోజని అభివర్ణించారు.

తెదేపా ఎమ్మెల్సీలు
తెదేపా ఎమ్మెల్సీలు

తెదేపా ఎమ్మెల్సీలు

మండలి రద్దుపై ఏకపక్షనిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నేడు బ్లాక్​డేగా అభివర్ణించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాక అసెంబ్లీలో చర్చించడం అనైతికమన్నారు. మండలిని పునరుద్ధరించాలని 5 రాష్ట్రాలు కోరుతుంటే..వైకాపా ప్రభుత్వం మాత్రం రద్దు నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. మరో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ... ఈ రోజు జరిగిన శాసనసభకు 18 మంది వైకాపా సభ్యులు గైర్హాజరయ్యారన్నారు. వారంతా మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించినట్లేనని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details