ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మసీదుల్లో చోరీ... రూ.లక్షన్నర నగదు మాయం - rayadurgam news updates

అనంతపురం జిల్లా రాయదుర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలోనే కాక, ప్రార్థనా మందిరాల్లోనూ దొంగతనాలు చేస్తున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లోని మసీదుల్లో దాదాపు రూ.లక్షన్నర నగదును దుండగులు అపహరించారు.

theft in masques in rayadurgam ananthapuram district
రాయదుర్గంలో దొంగతనానికి గురైన మసీదు

By

Published : Aug 28, 2020, 8:45 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఓబులచారి రోడ్డులో ఉన్న మక్కా మసీద్, తహసీల్దార్ రోడ్​లో ఉన్న జామియా మసీదులో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. హుండీల తాళాలు పగలగొట్టి నగదు అపహరించారు. మక్కా మసీదులోని హుండీలో రూ.40 వేలు, జామియా మసీదులోని హుండీలో రూ.లక్ష అపహరణకు గురైందని మసీద్ కార్యదర్శి సలావుద్దీన్ తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details