ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం చేయాలంటూ విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ ఎక్కిన యువకుడు - అనంతపురం జిల్లా వార్తలు

తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ అనంతపురం జిల్లా కడదరకుంటలో ఓ యువకుడు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ ఎక్కాడు. స్పందించిన పోలీసులు.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో కిందకు దిగాడు.

The young man who climbed the power Trans farmer to justice in ananthapuram district
న్యాయం చేయాలంటూ విద్యుత్ నియంత్రిక ఎక్కిన యువకుడు

By

Published : Jul 15, 2020, 7:56 PM IST

అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట గ్రామంలో ఓ యువకుడు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ ఎక్కి హల్​చల్​ చేశాడు.తన పొలం నుంచి ఓ ప్రముఖ కంపెనీ సిబ్బంది.. అక్రమంగా పవర్ లైన్ వేశారంటూ ఆరోపిస్తూ ట్రాన్స్​ఫార్మర్ ఎక్కాడు.

అయితే ఈ అంశంపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు తాము మూడు సంవత్సరాల క్రితమే పవర్ లైన్ పనులు చేశామని, అప్పుడు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ లైన్ తొలగింపునకు ఐదు రోజుల గడువు ఇవ్వాలని కోరినప్పటికీ.. అతను ఒప్పుకోకుండా విద్యుత్ స్తంభం కూల్చే ప్రయత్నం చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితుడు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి.

ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు

ABOUT THE AUTHOR

...view details