ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భిక్షాటనతో వచ్చిన డబ్బులను... వరద బాధితులకు అందజేత

వరదలతో నష్టపోయిన వారికి ఎమ్మెల్యే సాయం అందించారు. స్వయంగా ఆయనే భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను బాధితులకు అందజేశారు.

By

Published : Oct 8, 2019, 8:41 AM IST

ఎమ్మెల్యే

వరద బాధితులకు సాయం

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో రెండుసార్లు వరదలతో నష్టపోయిన భాదితులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగదు పంపిణీ చేశారు. పిన్నెపల్లి పాత చెరువు తెగి గత నెల 24న, ఈ నెల 3న యాడికి మండల కేంద్రంలోని లాలేప్ప కాలనీ, అంబేడ్కర్‌ కాలనీ, చౌడేశ్వరి కాలనీ, చెన్నకేశవ కాలనీ, ఆసుపత్రి కాలనీ, టీచర్స్ కాలనీలతోపాటు రెడ్ల గుడిసెలు, పిన్నెపల్లి గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు ఎమ్మెల్యే గత నెల 28న తాడిపత్రి పట్టణంలో భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమానికి కులసంఘాలు, కర్మాగారాలు, కళాశాలలు, వ్యాపారుల వద్ద నుంచి దాదాపు రూ.40 లక్షలు వచ్చింది. ఈ నగదును చేనేత కుటుంబానికి రూ.8 వేలు, సామాన్యు కుటుంబానికి రూ.3 వేలు నగదు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details