మహిళపై దాడి చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. దీపావళి సందర్భంగా ఇంటి వద్ద చోటు చేసుకున్న వివాదంతో కానిస్టేబుల్.. మహిళపై దాడి చేసి గాయపరిచారంటూ ఆందోళనకారులు వాపోయారు. దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సరిగా స్పందించలేదని మండిపడ్డారు. కానిస్టేబుల్పై ఫిర్యాదు చేస్తే, బాధితురాలి కొడుకుపై కేసు నమోదు చేశారని ... కానిస్టేబుల్ పై మాత్రం ఎలాంటి చర్యలు తెలుసుకోలేదని ఆరోపించారు. అతడిని సస్పెండ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి' - కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి!
కదిరిలో దీపావళి సందర్భంగా ఓ ఇంటి వద్ద చోటుచేసుకున్న వివాదంలో మహిళపై... కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. గాయపరిచాడు. ఇందుకు నిరసనగా బాధితురాలి తరఫున రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు.
!['మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4901064-847-4901064-1572359199880.jpg)
మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి
మహిళపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలి
ఇవీ చదవండి