అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని బెంచికొట్టాలలో నివాసముండే శంకర్ శుద్ధ జల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నారు. మృతుడికి గతరాత్రి సుధాకర్ అనే వ్యక్తితో ఓ హోటల్ వద్ద ఘర్షణ జరిగింది. గొడవను మనసులో పెట్టుకున్న సుధాకర్ ఉదయాన్నే దుకాణం తెరవడానికి వెళ్లిన శంకర్ను కత్తితో విచక్షణారహింతగా పొడిచాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శంకర్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడు తెదేపా నేత కావటంతో మాజీ శాసన సభ్యుడు జితేంద్రగౌడ్తోపాటు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చి మృతుడు బంధువులను పరామర్శించారు. ఘటనపై మండిపడ్డ ప్రజాసంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
గుంతకల్లులో వ్యక్తి దారుణ హత్య - The brutal murder of a man
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వ్యక్తి దారుణ హత్య