తెదేపా రెబల్ అభ్యర్థుల నామినేషన్ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తెదేపా రెబల్ అభ్యర్థులుగా ఇద్దరు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. పల్లె రఘునాథరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వవద్దంటు ఆందోళనలు జరుగుతున్నాయి. అధిష్టానం మాత్రం ఆయన వైపే మొగ్గు చూపటంతో నిరసన గళం వినిపిస్తున్నారు. పీసీ గంగన్న, అమ్మినేని యశోద నామినేషన్ వేశారు. పల్లెకు వ్యతిరేకంగా తాము నామినేషన్లు వెసినట్టు తెలిపారు. కర్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు.