ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డాక్టర్​తో పోలీసుల ప్రవర్తనకు సీఎందే బాధ్యత' - తేదేపా మాజీ ఎమ్మెల్యే ఈరన్న

డాక్టర్​పై దాడిని నిరసిస్తూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తెదేపా శ్రేణులు. ఈ విషయంపై ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు.

ananthapuram district
డాక్టర్ పై దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణుల నిరసన

By

Published : May 18, 2020, 5:37 PM IST

డాక్టర్ సుధాకర్​తో పోలీసులు ప్రవర్తించిన తీరును.. తెదేపా నేతలు తప్పుబట్టారు. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మార్వో కార్యాలయం వద్ద.. పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఇతర నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ ను.. సీఎం జగన్ ఆదేశాలతోనే పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details