పీఆర్ మోహన్ మరణం... ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధ కలిగించిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన తుదిశ్వాస విడిచేంత వరకు పార్టీలోనే కొనసాగారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. మోహన్ కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీఆర్ మోహన్ మృతికి పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, సీనియర్ నేత వీవీవీ చౌదరి సంతాపం ప్రకటించారు.
గుండెపోటుతో..