ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తెదేపా నిరసన - విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా హిందూపురంలో తెదేపా నేతల దర్నా

అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. కరెంట్ బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు.

tdp leaders protest in hindupuram on high electricity bills
విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తెదేపా నిరసన

By

Published : May 20, 2020, 3:06 PM IST

పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. కరోనాతో కష్టాలు పడుతున్న ప్రజలపై.. ప్రభుత్వం మరింత భారం మోపిందని విమర్శించారు.

పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. డివిజినల్ ఇంజినీర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details