ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2021, 7:24 PM IST

ETV Bharat / state

కరోనాతో తెదేపా నాయకుడు మృతి.. ఎమ్మెల్యే పయ్యావుల సంతాపం

కరోనాతో తెదేపా నేత, రాష్ట్ర తెలుగు సంఘం కార్యదర్శి తుర్పింటి శంకపర్ప మృతి చెందారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంతాపం తెలిపారు.

tdp leader died
ఉరవకొండలో కరోనాతో తెదేపా నేత మృతి

కరోనాతో ఉరవకొండ తెదేపా సీనియర్ నాయకుడు, తెలుగు రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి తుర్పింటి శంకరప్ప మృతి చెందారు. 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కాగా మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం కన్నుమూశారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ శంకరప్ప మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details