అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవిలోని పురాతన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సినీ నటుడు నందమూరి తారకరత్న దర్శించుకున్నారు. బూదగవి వచ్చిన తారకరత్నకు గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన, మండలంలోని నింబగల్లు గ్రామ శివారులో ఉన్న భగలముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.