ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం.. రిజిస్ట్రేషన్ కోసం గుంపులుగా వచ్చిన జనం - బేలుగప్పలో తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం

కరోనా మహమ్మారితో దేశం మొత్తం భయపడుతోంది. ఎక్కడ వైరస్ తమకు సోకుతుందేమోనన్న భయంతో ఎక్కడికక్కడ ఆందోళన చెందుతున్నారు. అయితే అనంతపురం జిల్లా బేలుగప్ప తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రవర్తిస్తున్నారు.

tahasildar office employees neglegence in corona virus in uravakonda ananthapuram district
బేలుగప్ప తహసీల్దార్ కార్యాలయంలో గుంపులుగా జనం

By

Published : Jul 6, 2020, 1:23 PM IST

Updated : Jul 6, 2020, 3:31 PM IST

అనంతపురం జిల్లా బేలుగప్ప మండల తహసీల్దార్ కార్యాలయం అధికారులు కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి స్థలాల రిజర్వేషన్ కోసం ప్రజలను రమ్మనటంతో వారు పెద్దఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. గుంపులు గుంపులుగా చాలామంది కనీసం మాస్కులు లేకుండా వచ్చారు. భౌతిక దూరం మచ్చుకైనా కనపడలేదు.

వచ్చిన జనానికి కార్యాలయంలో స్థలం సరిపోక దగ్గర్లోని కల్యాణ మంటపంలో అధికారులు రిజిస్ట్రేషన్ పనులు చేశారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఇంతమందిని ఒకేసారి అనుమతించడం విమర్శలకు తావిస్తోంది. గతంలో ఇక్కడ ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు.

Last Updated : Jul 6, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details