అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని సింహగిరి పురాధీశుడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. కార్తీకమాసం మూడో రోజైన నేడు ఆలయంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు తాకాయి. దీంతో అర్చకులు స్వామివారికి అభిషేకాలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతీ ఏటా కార్తీక మాసంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకడం ఇక్కడ ప్రత్యేకత అని భక్తులు తెలిపారు.
కార్తీకమాస వేళ శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు - Sunrises touching the Shivalinga in ramalingeswara temple news update
కార్తీకమాసంలో సూర్యకిరణాలు శివలింగాన్ని తాకటం.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అనంతపురం జిల్లా మడకశిరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ అద్భుతం జరిగింది.

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు