అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శివుని పర్వదినాన గర్భగుడిలోని స్వామివారిని ప్రభాత కిరణాలు తాకాయి. రథసప్తమి తర్వాత మళ్లీ ఈ రోజు సూర్యకిరణాలు లింగేశ్వరుడిని స్పృశించాయని ఆలయ పూజారి తెలిపారు. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భానుడి కాంతి ముందుగా స్వామి వారి పాదాలను తాకి.. మెల్లగా శిరస్సును చేరింది. ఏకంగా పది, పదిహేను నిమిషాల పాటు రవి కిరణాలు స్వామి వారి మూలవిరాట్టును తాకాయి.
రాయదుర్గం