ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధతో అన్న.. మనస్తాపంతో తమ్ముడు.. రోజుల వ్యవధిలోనే - ఏపీ తాజా వార్తలు

Two Brothers Suicide: ఆ తల్లిదండ్రులకు ముగ్గురు కుమారులు.. చేనేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదు.. రెండో కుమారుడు ఇటీవలే ఇల్లు నిర్మించుకున్నాడు. కానీ అప్పుల బాధలు ఎక్కువై.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తట్టుకోలేని మూడో కుమారుడు నీటికుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కొద్ది రోజుల వ్యవదిలోనే ఇద్దరు కుమారులు మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

Suicide of Two Brothers
ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య

By

Published : Jan 12, 2023, 4:23 PM IST

Two Brothers Suicide: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పామిడి మండలంలో కొండాపురం గ్రామంలో అన్న మృతిని జీర్ణించుకోలేక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేనేత కుటుంబానికి చెందిన రంగమ్మ, ఆంజనేయ దంపతులకు రంగనాయకులు, సుధాకర్, రంగస్వామి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబమంతా చేనేత పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పెద్ద కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదు. రెండవ కుమారుడు సుధాకర్ కొన్ని నెలల క్రితం ఇల్లు నిర్మించుకుని అప్పుల బాధను తాళలేక.. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. అన్న​ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన తమ్ముడు రంగస్వామి(25) నీటి కుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సుధాకర్​ మృతికి ఐదో రోజు చిన్న కర్మకాండ పనులు జరుపుతున్న సమయంలో బందువులు అంతా ఇంటి వద్ద ఉండగా బయటకు వెళ్లిన రంగస్వామి.. సోదరుడి మరణంతో మనోవేదనకు గురై.. గ్రామ శివారులో ఉన్న నీటి కుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. రంగస్వామి నీటి కుంటలో దూకిన విషయాన్ని అటుగా వెళ్తున్న స్థానిక గొర్రెల కాపరులు గమనించి.. గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం కాపరులు నీటి కుంటలో దూకి బాధితుడిని వెలికి తీయడానికి ప్రయత్మించారు. కానీ అప్పటికే రంగస్వామి మృతి చెందాడని తెలిపారు. కాపరుల ప్రయత్నం నిర్వీర్యం అయ్యింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడం.. మరో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న తమకు.. చేయూతను అందించాల్సిన కొడుకులు చితికి తామే నిప్పంటించడంతో కుటుంభీకులు తీవ్ర మనోవేదనకు గురైయ్యారు.. ఇకపై తమ కష్టసుఖాలను ఎవరితో పంచుకోవాలని బోరుమని విలపిస్తున్నారు. మతిస్థితం లేని మరో కొడుకుతో జీవనాన్ని ఎలా ముందుకు సాగించాలో తెలియటం లేదని వాపోతున్నారు. రంగస్వామికి భార్య సునీత, కుమారుడు రాజేష్ ఉన్నారు. మరోవైపు కొద్ది రోజుల వ్యవధిలో ఓకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పామిడి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details