ఆంధ్రప్రదేశ్

andhra pradesh

rain problems: ఆ కాలనీకి వెళ్లాలంటే గోడెక్కాల్సిందే!

By

Published : Jul 23, 2021, 9:11 AM IST

వర్ష ప్రభావానికి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రాంతంలో రోడ్డు పాడవడటంతో.. గత్యంతరం లేక విద్యార్థులు.. ఉపాధ్యాయులు గోడమీదనుంచి ఇంటికి వెళుతున్నారు. పక్కనే ట్రాన్స్​ఫార్మర్ ఉన్నా వారేం చేయలేని దుస్థితి. రోజూ.. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు.

students  went   home by walk  on wall at uravakonda
ఉరవకొండలో విద్యార్థుల అవస్థలు

ఉరవకొండలో విద్యార్థుల అవస్థలు

దారి ఉన్నా ప్రమాదకరంగా గోడెక్కి వెళ్లాల్సిన దుస్థితి అనంతపురం జిల్లా ఉరవకొండలో నెలకొంది. పట్టణంలోని వీరశైవనగర్‌కు ప్రధాన రహదారి నుంచి మార్గం లేదు. కాలనీవాసుల వినతి మేరకు ప్రజాప్రతినిధులు 5 నెలల కిందట స్థానిక విద్యుత్తు కార్యాలయ ప్రాంగణం పక్కగా రోడ్డు వేశారు. దారి నిర్మాణంలో మొత్తం బంక మట్టిని వాడారు. ఇంకేం.. వర్షాలకు ఆ మట్టి బురదలా మారి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కాళ్లకు బురద అంటుకొని వదలడం లేదు. చెప్పులు అందులోనే ఇరుక్కుపోతున్నాయి. బురద తక్కువ ఉన్నచోట అడుగేస్తే జారుతోంది.

దీంతో ఆ మార్గంలో డిగ్రీ కళాశాలకు వెళ్తున్న యువతులు..గత్యంతరం లేక విద్యుత్తు కార్యాలయ ప్రహరీ ఎక్కి వెళుతున్నారు. ఆ గోడ పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు మాత్రం ఆటోలో రెండున్నర కిలోమీటర్లు తిరిగి ప్రధాన రోడ్డుకు చేరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details