ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 23, 2020, 5:53 PM IST

ETV Bharat / state

విద్యుత్ తీగ యమపాశమైంది

అనంతపురం జిల్లాలో విద్యుదఘాతానికి గురై ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంలో తల్లిదండ్రులు బోరున విలపించారు.

STUDENT DETH WITH CURRENT SHOK
అనంతపురం జిల్లాలో విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి

అనంతపురం జిల్లాలో విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా ముదిగుబ్బలో విద్యుదఘాతానికి గురై ఓ విద్యార్థి మృతి చెందాడు. మదనపల్లిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్.. శివరాత్రి సెలవు దినం కావడంతో ఇంటికి వచ్చాడు. ఇంటిపైకి వెళ్ళిన శ్రీకాంత్ చేతికి ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా విద్యుదఘాతానికి గురై చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details