ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సవతితల్లి ప్రతాపం... కొడుకు , భర్తకు గాయాలు... - కొత్తపల్లిలో సవతితల్లి వార్తలు

అమ్మ చనిపోతేనేం!..సవతితల్లే అమ్మ అనుకున్నాడు ఓ మతిస్థిమితం లేని కొడుకు. కానీ ఆ తల్లి అతన్ని.. తన సొంతకొడుకు అనుకోలేదు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిసి కూడా..అతనిపై దాడి చేసింది. అడ్డువచ్చిన భర్తను సైతం కొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.

stepmother with her own son attacked to her husband and son  in kottapalli
కొత్తపల్లిలో కొడుకుపై సవతితల్లి దాడి

By

Published : Jun 20, 2020, 12:45 PM IST

ఓ మతిస్థిమితం లేని కొడుకుపై సవతితల్లి ప్రతాపం చూపించింది. తన సొంత కొడుకుతో కలిసి..ఆమె భర్త, కొడుకుపై దాడి చేసింది. కుటుంబ కలహాల కారణంగా సవతి తల్లి కొడుకుపై దాడి చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నారప్పకు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు మధు మానసిక దివ్యాంగుడు.

కుటుంబ కలహాల కారణంగా సవతి తల్లి ఆమె కొడుకు కలిసి.. మొదటి భార్య కొడుకైన మధు, భర్త నారప్పను తలపై కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో వారిద్దరికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు

ABOUT THE AUTHOR

...view details