కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యతగా కదలాల్సిన తరుణమిది. కొందరు ప్రజల్లో చైతన్యం తెస్తుండగా.. మరికొందరు ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. ఈ క్రమంలో.. లాక్డౌన్ ఉల్లంఘించి మెరుపు వేగంతో వెళ్లి... కరోనా బారిన పడొద్దని ఓ యువకుడు శిరస్త్రాణం ధరించి అనంతపురం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. విధి నిర్వహణకు బయలుదేరేది మొదలు.. తిరిగి ఇంటికి వచ్చే వరకు ప్రత్యేక దుస్తులు ధరిస్తూ.. మహమ్మారిని దరి దాపులకు కూడా రానీయకుండా.. ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కరోనాపై అందరికీ అవగాహన కలిగించేలా..!
అనంతపురం జిల్లా యువకులు కొందరు.. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగించేలా ఇలా విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. చూపరులను ఆకట్టుకుంటున్నారు.
కరోనాపై అవగాహనకై యువకుల ప్రత్యేక అలంకరణ