ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంతకల్లులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

By

Published : Mar 8, 2021, 10:49 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించారు. 10వ తేదీన ఎన్నికలు జరగనున్న పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్​లను పరిశీలించారు. పోలింగ్​ బూత్​ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

sp satya yesubabu examined the election arrangements at guntakal
గుంతకల్లులో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లులో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పర్యటించారు. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లను, స్ట్రాంగ్ రూమ్​లను పరిశీలించారు. జిల్లాలో 11 చోట్ల ప్రత్యేక పోలీసు బందోబస్తును నియమించామన్నారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల మంది దాకా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన తెలిపారు.

అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 30 వేల మద్యం బాటిళ్లను సీజ్ చేయటంతో పాటు.. 17 లక్షల నగదును పట్టుకున్నామని అన్నారు.

ఇదీ చదవండి

'ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'

ABOUT THE AUTHOR

...view details