ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెబల్​గా పోటీ చేసిందని.. మహిళతో అధికార పార్టీ నేతల అసభ్య ప్రవర్తన - సోమందేపల్లిలో మహిళ చీర లాగిన వైకాపా కార్యకర్తలు

భారీ శబ్దాలతో టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్న పద్మ అనే మహిళపై.. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లిలో వైకాపా నేతలు దాడికి దిగారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా రెబల్​గా పోటీ చేయడంతో.. ఆమె వస్త్రాలను లాగి, దాడి చేశారు. అడ్డుకున్నవారిపైనా దాడిగి దిగడంతో బాధితురాలు, గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు.

ycp leaders attack on woman at somamdepalli
సోమందేపల్లిలో మహిళపై వైకాపా నేతల దాడి

By

Published : Feb 23, 2021, 9:08 PM IST

సోమందేపల్లిలో మహిళపై వైకాపా నేతల దాడి

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లిలో పంచాయతీ ఎన్నికల్లో రెబల్​గా వార్డు సభ్యురాలిగా పోటీచేసిన పద్మతో.. అధికార పార్టీ కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారు. తన దుస్తులు చింపి దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మాజీ సర్పంచి, వాలంటీర్​తో పాటు దాదాపు 200మంది గ్రామస్థులు.. సోమందేపల్లి పోలీస్ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేశారు.

ఇటీవల జరిగిన పంచాయతీ పోరులో వైకాపా మద్దతుదారుడు విజయం సాధించగా.. ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ, నానా హంగామా సృష్టించారని బాధితురాలు పేర్కొంది. ఆ శబ్దానికి తమ గొర్రెలు భయపడటంతో.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. ఆగ్రహంతో ఊగిపోయిన అధికార పార్టీ నేతలు.. తన ఇంటిపై రాళ్లతో దాడి చేసి, దుర్భాషలాడారని వాపోయింది. అంతటితో ఆగకుండా తన దుస్తులు చించారని ఆవేదన వ్యక్తం చేసింది. అడ్డుకోవటానికి వచ్చిన వారిపైనా దాడులు చేశారని వెల్లడించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details