అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్కు వచ్చే వారిపై.. సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. కరోనా వైరస్ దరిచేరకుండా తమిళనాడులో ఒక మార్కెట్ వద్ద ఈ విధానం అమలు చేస్తుండటాన్ని అధ్యయనం చేశామని.. ధర్మవరం పురపాలక కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయలు మార్కెట్కు వెళ్లేవారిపై.. ఈ యంత్రాల ద్వారా వైరస్ నాశక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ద్రావణం వల్ల వైరస్ దరిచేరదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మార్కెట్కు వెళ్లేవారు ద్రావణాన్ని పిచికారీ చేయించుకొని.. కొత్త అనుభూతితో వెళ్తున్నామన్నారు.
కూరగాయల మార్కెట్కి వెళ్లేవారిపై ద్రావణం పిచికారీ - మార్కెట్కి వెళ్లేవారిపై సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ
కరోనా నివారణ చర్యల్లో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని కూరగాయల మార్కెట్ కు వెళ్తున్న వారిపై.. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.
Sodium hypochloride solution is poured on purchasers at dharmavaram market in ananthapuram