ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుత్తిలో రోడ్డు ప్రమాదాలు... ఆరుగురికి తీవ్ర గాయాలు

By

Published : Jan 20, 2021, 9:51 AM IST

అనంతపురం జిల్లాలోని రెండు విభిన్న ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అవ్వగా... ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

road accident
గుత్తిలో రోడ్డు ప్రమాదాలు... ఆరుగురికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు చికిత్స నిమిత్తం వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అదనపు చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

మరో ఘటనలో పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామ సమీపంలోని 67 నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details