ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2021, 11:15 AM IST

ETV Bharat / state

కరోనా బాధిత కుటుంబానికి అండగా ఎస్సై.. సరకులు అందజేత

అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్సై రమేశ్​ రెడ్డి... కరోనా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. నిత్యావసర సరకులు అందించి మానవత్వం చాటుకున్నారు.

essential necessities
నిత్యావసరాలు అందిస్తున్న ఎస్సై

కొవిడ్​ బారిన పడి ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబానికి నిత్యావసర సరకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్సై. పట్టణంలోని కోట వీధిలో తల్లీకుమారుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారికి కరోనా సోకి.. హోం ఐసోలేషన్​​లో ఉన్నారు.

కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే ఆ కుటుంబానికి ప్రస్తుత పరిస్థితి భారమైంది. ఇంట్లో సరకులు లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్​ రెడ్డి.. తన సిబ్బందితో వెళ్లి ఒక బియ్యం బస్తా, నెలకు సరిపడా సరకులు అందించారు. ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details