ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సౌర విద్యుత్ ప్రాజెక్టులో విద్యుదాఘాతం.. నలుగురి ఇంజనీర్లకు గాయాలు - short circuit four engineers injured

అనంతపురం జిల్లా నంబులపూలకుంటలోని సౌర విద్యుత్ ప్రాజెక్టులో విద్యుదాఘాతం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీర్లకు గాయాలయ్యాయి. గమేషా కంపెనీ బ్లాక్ నెంబర్ 22లో ఇన్వర్టర్ ప్యానెల్​లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

short circuit at solar project
సౌర విద్యుత్ ప్రాజెక్టులో విద్యుదాఘాతం

By

Published : Jun 29, 2021, 10:51 AM IST

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలోని సౌర విద్యుత్ ప్రాజెక్టులో విద్యుదాఘాతం జరిగింది. ప్రాజెక్టులోని గమేషా కంపెనీకి చెందిన బ్లాక్ నెంబర్ 22లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇన్వర్టర్ ప్యానెల్​లో మరమ్మతులు చేస్తుండగా విద్యుతాఘాతం చోటు చేసుకుందని సంస్థ అధికారులు తెలిపారు. మరమ్మతులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నలుగురు ఇంజనీర్లకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన మిగతా సిబ్బంది గాయపడిన వారిని కడప జిల్లా గాలివీడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చదవండి:

POWER WAR: ఇరురాష్ట్రాల మధ్య విద్యుత్​ పంచాయితీగా మారిన జల వివాదం

RRR letter: 'నవ సూచనల' పేరుతో సీఎం జగన్​కు రఘురామరాజు లేఖ

ABOUT THE AUTHOR

...view details