ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నడుచుకుంటూ వెళ్తే ఆపరు అనుకున్నాడేమో..! గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Jan 21, 2021, 9:19 PM IST

పోలీసుల కళ్లుగప్పి చెక్​పోస్ట్​ వద్ద సంచితో వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి 7.4 కిలోల గంజాయిని అనంతపురం జిల్లా చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వర్తిస్తుడగా సంచితో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఆపగా.. సంచిలో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరచనున్నారు.

illegal cannabis carrying men caught by chilamathur police
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద 7.4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం రూరల్ సీఐ ధరణి కిశోర్, చిలమత్తూరు ఎస్సైల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా ఓ వ్యక్తి సంచి ఎత్తుకొని వెళుతుండగా పోలీసులు అతన్ని ఆపి సంచిని తనిఖీ చేశారు. సంచిలో ఉన్న 7.4 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు.. సంచిని స్వాధీనం చేసుకుని అతణ్ని అరెస్టు చేశారు.

బెంగళూరుకు చెందిన మహబూబ్ నౌమన్ ఉమార్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని పుణె నుంచి గంజాయి అక్రమంగా తీసుకొచ్చి సోమందేపల్లి పారిశ్రామికవాడలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి, నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తామని ఆయన పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా పట్టివేత..ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details